<?xml version="1.0" encoding="UTF-8"?><?xml-stylesheet href="yrss.xsl" type="text/xsl" media="screen" ?><rss version="2.0"><channel><title>Yahoo! Telugu: News</title><link>http://telugu.webdunia.com/newsworld/</link><description>Yahoo! Telugu</description><language>te-in</language><copyright>Copyright (c) 2009 Yahoo! Inc. All rights reserved.</copyright><lastBuildDate>Mon, 23 Nov 2009 21:37:49 GMT</lastBuildDate><item><title>ప్రశాంతంగా ముగిసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్</title><guid isPermaLink="true">http://telugu.webdunia.com/newsworld/news/apnews/0911/23/1091123078_1.htm</guid><link>http://telugu.webdunia.com/newsworld/news/apnews/0911/23/1091123078_1.htm</link><description>గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల సమరంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని నగర పోలీస్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. చిన్నపాటి గొడవలు మినహా ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోలేదని ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ గొడవలకు సంబంధించి 12 కేసులు నమోదు కాగా, తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.</description><pubDate>Mon, 23 Nov 2009 19:49:30 GMT</pubDate></item><item><title>2050 నాటికి సూపర్‌ పవర్‌గా భారత్‌</title><guid isPermaLink="true">http://telugu.webdunia.com/newsworld/finance/news/0911/23/1091123075_1.htm</guid><link>http://telugu.webdunia.com/newsworld/finance/news/0911/23/1091123075_1.htm</link><description>ప్రస్తుతం భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధివైపు పయనిస్తోంది. 2050 నాటికి ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఎదగనుంది. 

2050 నాటికి భారతదేశం ఆర్థికంగా సూపర్ పవర్‌గా ఎదగనుందని, జి- 20 దేశాల కంటే భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందని ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ బులెటిన్ పేర్కొంది.</description><pubDate>Mon, 23 Nov 2009 19:11:03 GMT</pubDate></item><item><title>లాభాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్</title><guid isPermaLink="true">http://telugu.webdunia.com/newsworld/finance/market/0911/23/1091123074_1.htm</guid><link>http://telugu.webdunia.com/newsworld/finance/market/0911/23/1091123074_1.htm</link><description>దేశీయ బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలతో ముగిసింది. మదుపుదారులు కొనుగోళ్ల వైపు దృష్టి సారించడంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 158 పాయింట్లు పుంజుకుని, 17,180 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 51 పాయింట్లు బలపడి, 5,103 పాయింట్ల వద్ద నిలిచింది. 

ఆసియా, యూరోపియన్ మార్కెట్ల ట్రేడింగ్ పుంజుకోవడం, విదేశీ సంస్థ లియోండెల్‌బాసెల్ ఇండస్ట్రీ కొనుగోలుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ మొగ్గుచూపడం వంటి కారణాలు స్టాక్ మార్కెట్‌ను లాభాల బాటన పయనింపజేశాయి.</description><pubDate>Mon, 23 Nov 2009 18:30:13 GMT</pubDate></item><item><title>బలూచిస్థాన్‌లో భారత్ పాత్రపై ఆధారాల సేకరణ: పాక్</title><guid isPermaLink="true">http://telugu.webdunia.com/newsworld/news/international/0911/23/1091123069_1.htm</guid><link>http://telugu.webdunia.com/newsworld/news/international/0911/23/1091123069_1.htm</link><description>బలూచిస్థాన్‌లో జరుగుతున్న అల్లర్ల వెనుక భారత్ హస్తం ఉందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరోమారు ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలను తాము సేకరిస్తున్నట్టు ఆ శాఖామంత్రి షా మొహ్మద్ ఖురేషీ తెలిపారు.</description><pubDate>Mon, 23 Nov 2009 17:04:48 GMT</pubDate></item><item><title>లాభాలతో కొనసాగుతున్న విదేశీ మార్కెట్లు</title><guid isPermaLink="true">http://telugu.webdunia.com/newsworld/finance/market/0911/23/1091123065_1.htm</guid><link>http://telugu.webdunia.com/newsworld/finance/market/0911/23/1091123065_1.htm</link><description>సోమవారం దేశీయ బాంబే స్టాక్ మార్కెట్‌తో పాటు విదేశీ ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాలను నమోదు చేసుకుంటున్నాయి.  భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.00 గంటలకు యూరప్, ఆసియా మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. అలాగే దేశీయ బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మాత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి 148 పాయింట్ల భారీ లాభంతో 17,170పాయింట్ల మార్కు వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 44 పాయింట్లు పుంజుకుని 5,096 మార్కు వద్ద ర్యాలీని ముగించింది. ఇకపోతే.. యూరప్ మార్కెట్లు ఎఫ్‌టీఎస్ఈ 100 సూచీ 67 పాయింట్ల లాభంతో, 5,335 పాయింట్ల వద్ద కొనసాగుతోండగా,  డాక్స్ 82 పాయింట్లు పుంజుకుని 5,746 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.అలాగే ఆసియా మార్కెట్లు కూడా సోమవారం లాభాల బాటలో ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా నికాయ్ 225 సూచీ.. 51 పాయింట్ల లాభంతో 9,497 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. హాంగ్ షెంగ్ 315 పాయింట్లు భారీగా పుంజుకుని, 22,771 పాయింట్ల వద్ద పయనిస్తోంది.</description><pubDate>Mon, 23 Nov 2009 16:19:42 GMT</pubDate></item><item><title>సచిన్ టెండూల్కర్ స్వార్థపరుడు: ఎంపీ సంజయ్ రౌత్</title><guid isPermaLink="true">http://telugu.webdunia.com/newsworld/news/national/0911/23/1091123064_1.htm</guid><link>http://telugu.webdunia.com/newsworld/news/national/0911/23/1091123064_1.htm</link><description>&apos;మాస్టర్ బ్లాస్టర్&apos; సచిన్ టెండూల్కర్‌పై శివసేన మరోమారు విమర్శలు వర్షం గుప్పించింది. ఈ దఫా మాత్రం సేన చీఫ్ బాల్‌థాక్రే ఆ పాత్రను పోషించలేదు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్వీకరించారు. పార్టీ పత్రికలో సచిన్‌పై విమర్శల వర్షం గుప్పించారు. సచిన్ నిజమైన మహారాష్ట్ర వాది కాదని ధ్వజమెత్తారు.</description><pubDate>Mon, 23 Nov 2009 16:13:13 GMT</pubDate></item><item><title>ఆసియా మార్కెట్ల  ప్రభావం: లాభాల్లో సెన్సెక్స్</title><guid isPermaLink="true">http://telugu.webdunia.com/newsworld/finance/market/0911/23/1091123061_1.htm</guid><link>http://telugu.webdunia.com/newsworld/finance/market/0911/23/1091123061_1.htm</link><description>దేశీయ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడం, ఆసియా మార్కెట్ల ఆశాజనక సంకేతాలు బాంబే స్టాక్ మార్కెట్‌ను లాభాల్లో పయనింపజేస్తున్నాయి. ఆసియా, యూరోపియన్ మార్కెట్ల ట్రేడింగ్ ఊపందుకోవడంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ 171 పాయింట్లు వృద్ధి చెంది, 17,193 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 49 పాయింట్లు బలపడి, 5,102 పాయింట్లు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.</description><pubDate>Mon, 23 Nov 2009 15:55:08 GMT</pubDate></item><item><title>గ్రేటర్ సమరం: ఓటేసిన టెన్నిస్ తార సానియా మీర్జా</title><guid isPermaLink="true">http://telugu.webdunia.com/newsworld/news/apnews/0911/23/1091123059_1.htm</guid><link>http://telugu.webdunia.com/newsworld/news/apnews/0911/23/1091123059_1.htm</link><description>గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖ టాలీవుడ్ స్టార్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన ఓటు హక్కును వినియోగించారు. కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.</description><pubDate>Mon, 23 Nov 2009 15:41:50 GMT</pubDate></item><item><title>ఊపందుకున్న విదేశీ మార్కెట్ల ట్రేడింగ్: పురోగమనంలో సెన్సెక్స్</title><guid isPermaLink="true">http://telugu.webdunia.com/newsworld/finance/market/0911/23/1091123058_1.htm</guid><link>http://telugu.webdunia.com/newsworld/finance/market/0911/23/1091123058_1.htm</link><description>యూరోపియన్ మార్కెట్లు ఆశాజనకంగా ప్రారంభం కావడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పయనిస్తోంది. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 111 పాయింట్లు పుంజుకుని, 17,133 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 41 పాయింట్లు బలపడి, 5,093 మార్కు వద్ద కొనసాగుతోంది. ఆయిల్ గ్యాల్, ఎఫ్ఎమ్‌సీజీ, మెటల్, పార్మా వాటాల కొనుగోళ్ల పుంజుకోవడం కూడా బాంబే స్టాక్ మార్కెట్ లాభదాయకంగా కొనసాగడానికి ప్రధాన కారణమని బాంబే స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.</description><pubDate>Mon, 23 Nov 2009 15:29:54 GMT</pubDate></item><item><title>తెలంగాణాకు జైకొట్టిన &quot;యాష్కీ&quot; మగాడు: కేసీఆర్</title><guid isPermaLink="true">http://telugu.webdunia.com/newsworld/news/apnews/0911/23/1091123057_1.htm</guid><link>http://telugu.webdunia.com/newsworld/news/apnews/0911/23/1091123057_1.htm</link><description>ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన ఎంపీ మధుయాష్కీ నిజమైన మగాడు అని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అన్నారు. సోమవారం వరంగంలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణా విద్యార్థుల సదస్సులో పాల్గొని ప్రసంగించారు. 
</description><pubDate>Mon, 23 Nov 2009 15:29:07 GMT</pubDate></item><item><title>26/11 సూత్రధారులపై పాక్ చర్యలు పూజ్యం: పీఎం</title><guid isPermaLink="true">http://telugu.webdunia.com/newsworld/news/international/0911/23/1091123056_1.htm</guid><link>http://telugu.webdunia.com/newsworld/news/international/0911/23/1091123056_1.htm</link><description>ముంబై దాడుల సూత్రధారులపై పాకిస్థాన్ చేపట్టిన చర్యలు పూజ్యమని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ దాడులు జరిగి ఏడాది కావస్తున్నా, వీటికి సంబంధించి పలు ఆధారాలు సమర్పించినా పాక్ వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదన్నారు.</description><pubDate>Mon, 23 Nov 2009 15:13:21 GMT</pubDate></item><item><title>రోశయ్య ధృతరాష్ట్రుడైతే.. నాగేందర్ దుర్యోధనుడు..!</title><guid isPermaLink="true">http://telugu.webdunia.com/newsworld/news/apnews/0911/23/1091123055_1.htm</guid><link>http://telugu.webdunia.com/newsworld/news/apnews/0911/23/1091123055_1.htm</link><description>రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన జరుగుతుందని ఇటీవల ధ్వజమెత్తిన తెలుగుదేశం పార్టీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడింది. రోశయ్య ధృతరాష్ట్రుడు అయితే దానం నాగేందర్ దుర్యోధనుడిలా చెలరేగుతున్నారని తెదేపా నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌లో కాంగ్రెస్ అక్రమాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.</description><pubDate>Mon, 23 Nov 2009 14:31:25 GMT</pubDate></item><item><title>ఈ సమావేశాల్లో సభ ముందుకు నివేదిక: చిదంబరం</title><guid isPermaLink="true">http://telugu.webdunia.com/newsworld/news/national/0911/23/1091123054_1.htm</guid><link>http://telugu.webdunia.com/newsworld/news/national/0911/23/1091123054_1.htm</link><description>బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ జరిపిన జస్టీస్ లిబర్హాన్ కమిషన్ సమర్పించిన నివేదికను ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లోనే సభ ముందు ఉంచుతామని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు. అలాగే, ఒక ఆంగ్ర వార్తపత్రికలో వచ్చిన కథనం సారాంశంపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు.</description><pubDate>Mon, 23 Nov 2009 14:28:31 GMT</pubDate></item><item><title>అమెరికాలో మూతపడ్డ 124 బ్యాంకులు</title><guid isPermaLink="true">http://telugu.webdunia.com/newsworld/finance/news/0911/23/1091123053_1.htm</guid><link>http://telugu.webdunia.com/newsworld/finance/news/0911/23/1091123053_1.htm</link><description>అమెరికాలో నిత్యం బ్యాంకులు దివాళా తీస్తున్నాయి. గత వారం ఫ్లోరిడాలోనున్న కామర్స్ బ్యాంక్ దివాళా తీసిన తరువాత ఈ ఏడాది మూతపడ్డ బ్యాంకులు 124కు చేరుకున్నాయి.  
</description><pubDate>Mon, 23 Nov 2009 14:28:21 GMT</pubDate></item><item><title>లియోండల్ కొనుగోలుపై ఆర్ఐఎల్ దృష్టి: లాభాల్లో సెన్సెక్స్</title><guid isPermaLink="true">http://telugu.webdunia.com/newsworld/finance/market/0911/23/1091123051_1.htm</guid><link>http://telugu.webdunia.com/newsworld/finance/market/0911/23/1091123051_1.htm</link><description>అతిపెట్ట విదేశీ సంస్థ లియోండల్ కొనుగోలు రిలయన్స్ సై అనడం బాంబే స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది. సక్సెస్‌ఫుల్ బిడ్డర్‌గా నిలిచేందుకు ఇప్పటికే ఆఫర్ బిడ్‌ను కూడా సమర్పించింది. ఈ ఆఫర్ విలువ 12 బిలియన్ డాలర్ల వరకు (రూ. 57వేల కోట్లకు పైగా) ఉండొచ్చునని పరిశ్రమ వర్గాల అంచనా. ఈ నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలను నమోదు చేసుకుంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 155 పాయింట్లు వృద్ధి చెంది, 17,177 మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 47 పాయింట్లు బలపడి, 5,100 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.</description><pubDate>Mon, 23 Nov 2009 14:09:40 GMT</pubDate></item><item><title>లాభాల్లో స్టాక్ మార్కెట్: 136 పాయింట్ల సెన్సెక్స్ వృద్ధి</title><guid isPermaLink="true">http://telugu.webdunia.com/newsworld/finance/market/0911/23/1091123049_1.htm</guid><link>http://telugu.webdunia.com/newsworld/finance/market/0911/23/1091123049_1.htm</link><description>ఎగుమతి రంగంలో పన్ను తిరిగి చెల్లించే పథకాన్ని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ విషయమై ఆర్థిక శాఖ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుండటంతో బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలను నమోదు చేసుకుంటుంది. దీంతో సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 136 పాయింట్లు పుంజుకుని 17,158 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 44 పాయింట్లు బలపడి, 5,096 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.</description><pubDate>Mon, 23 Nov 2009 13:41:43 GMT</pubDate></item><item><title>ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు: ముఖ్యమంత్రి రోశయ్య</title><guid isPermaLink="true">http://telugu.webdunia.com/newsworld/news/apnews/0911/23/1091123048_1.htm</guid><link>http://telugu.webdunia.com/newsworld/news/apnews/0911/23/1091123048_1.htm</link><description>గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. ఓటర్లకు మీరిచ్చే సందేశం ఏమిటని? మీడియా అడిగిన ప్రశ్నకు ఓటర్లు చాలా తెలివైన వాళ్లని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య సమాధానమిచ్చారు. ఓటర్లకు అన్ని బాగా తెలుసునని, చైతన్యవంతులని సీఎం అన్నారు. అంతేగాకుండా ఓటర్లకు ముఖ్యమంత్రిగా తానేమీ చెప్పాల్సిన అవసరం లేదని రోశయ్య పేర్కొన్నారు. </description><pubDate>Mon, 23 Nov 2009 13:26:42 GMT</pubDate></item><item><title>భారత ప్రధానిగా అవుతానని ఊహించలేదు: మన్మోహన్</title><guid isPermaLink="true">http://telugu.webdunia.com/newsworld/news/international/0911/23/1091123046_1.htm</guid><link>http://telugu.webdunia.com/newsworld/news/international/0911/23/1091123046_1.htm</link><description>ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారతదేశానికి ప్రధానమంత్రి అవుతానని కలలో కూడా ఊహించలేదని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. దీనికంతటకీ ప్రధాన కారణం.. తన విద్యాభ్యాసమేనన్నారు.</description><pubDate>Mon, 23 Nov 2009 13:21:45 GMT</pubDate></item><item><title>కాంగ్రెస్‌ పార్టీవి కుళ్లు రాజకీయాలు: రాజ్‌నాథ్ సింగ్</title><guid isPermaLink="true">http://telugu.webdunia.com/newsworld/news/national/0911/23/1091123043_1.htm</guid><link>http://telugu.webdunia.com/newsworld/news/national/0911/23/1091123043_1.htm</link><description>సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కుళ్లు రాజకీయాలకు పాల్పడుతోందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లను మభ్యపెట్టేందుకు ఇలా చేస్తోందని ఆరోపించారు. లిబెర్హాన్</description><pubDate>Mon, 23 Nov 2009 13:05:41 GMT</pubDate></item><item><title>48 కోట్లకు చేరుకున్న మొబైల్ వినియోగదారులు</title><guid isPermaLink="true">http://telugu.webdunia.com/newsworld/finance/news/0911/23/1091123042_1.htm</guid><link>http://telugu.webdunia.com/newsworld/finance/news/0911/23/1091123042_1.htm</link><description>దేశంలో అక్టోబర్ నెలలో రికార్డు స్థాయిలో 1 కోటి 66 లక్షల 70  వేల మంది కొత్తగా మొబైల్ కనెక్షన్లను తీసుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా మొబైల్ వాడేవారి సంఖ్య 48 కోట్ల 84 లక్షలకు చేరుకుంది.</description><pubDate>Mon, 23 Nov 2009 13:04:37 GMT</pubDate></item></channel></rss>