|
| గణనాధుని పాదాలకు పత్రపూజ | |
వినాయక పూజలో పిండివంటలకు, ఫలాలకు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, పత్రాలకు ఉన్న ప్రాధాన్యత తక్కువేం కాదు. మన శరీర ఆరోగ్యపరిరక్షణకు అవసరమైన 21 పత్రాలను గుర్తించి వాటిని వినాయక పూజలో చేర్చారు. ఏకవింశతిపత్రపూజ అంటూ పత్రాలతోనే వినాయకుని పూజించే పద్ధతిని ప్రవేశపెట్టారు. శ్రీహరి ఎత్తినవి దశ (10) అవతారాలైతే, శంకరుని రూపాలు ఏకాదశ (11) కాబట్టి శివకేశవ అబేధంతో మొత్తం ఇరవై ఒక్క పత్రాలతో పూజ జరపాలని చెప్పారు. ఈ పత్రపూజ స్వామికి ప్రీతికరం.
1. మాచీపత్రం, 2. బృహతీ పత్రం, 3. బిల్వపత్రం (మారేడు పత్రం), 4. దూర్వాయుగ్మం (గరిక), 5. దత్తూర పత్రం ( ఉమ్మెత్త), 6. బదరీపత్రం (రేగు ఆకు), 7. అపామార్గ పత్రం ఉత్తరేణి పత్రం, 8. తులసీ పత్రం, 9. చూతపత్రం (మామిడి పత్రం), 10. కరవీరపత్రం (గన్నేరు పత్రాలు), 11. విష్ణుక్రాంతం (హరిపత్రం), 12. దాడిమీ పత్రం (దానిమ్మ పత్రం), 13. దేవదారుపత్రం, 14. మరువక పత్రం (మరువము), 15. సింధువార పత్రం (వావిలాకు), 16. జాజిపత్రం, 17. గండకీ పత్రం (కామంచి), 18. శమీపత్రం (జమ్మిపత్రం), 19. అశ్వత్థ పత్రం (రావి ఆకు), 20. అర్జున పత్రం (మద్ది ఆకు), 21. అర్కపత్రం (జిల్లేడు పత్రం).
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - అది గదిగో ఆ చక్రం నిలిచిపోదు
చైతన్యపు ఆ స్రవంతి ఇంకిపోదు
వీస్తున్నగాలి రేపుతున్న కిరణకేశాల్ని... |
| |
|
|
|
|
|
|
|