యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ దర్శనం వ్రతాలు - పండుగలు
రాఖీ పండుగ ఎలా వచ్చిందంటే...
సోమవారం, 27 ఆగస్టు 2007   ( 15:20 IST )
Rakhi
AP
పూర్వం దేవతలు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. ఈ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారంతో అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను గమనించిన ఇంద్రాణి "శచీదేవి" తరుణోపాయముకై ఆలోనలో పడుతుంది. ఇంతలో రాక్షసరాజు అమరావతిని కూడా ఆక్రమించుకోబోతున్న విషయం శచీదేవికి తెలుస్తుంది.

దీనితో చేసేది ఏమీలేక సరిగా అదే రోజు శ్రావణ పూర్ణిమ అవడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి, ఆ పూజించబడిన "రక్షా"ను శచీదేవి భర్త దేవేంద్రుని చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలు తెచ్చి ఇంద్రునికి కట్టి యుద్ధానికి పంపుతారు. ఈ విధంగా "రక్ష" ఇంద్రుని విజయయాత్రకు అండగా నిలిచి, తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందడానికి దోహదపడుతుంది.

ఆనాడు శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనోత్సవం నేడు రాఖీ పండుగగా ఆచరించబడుతోంది. ఈ రాఖీకి ఉన్న పవిత్రత ఏమిటంటే భర్తకు భార్య, సోదరులకు సోదరి కట్టే రాఖీ ద్వారా వారు తలపెట్టే కార్యములు విజయవంతమై సుఖసంపదలు కలగాలని, వారి మాన మార్యాదలకు వారు బాసటగా ఉండాలని ఆకాంక్షించే సత్‌సంప్రదాయమే ఈ రాఖీ విశిష్టత.

అలా రాఖీలు కట్టించుకున్న భర్తలు, సోదరులు వారికి నూతన వస్త్రాలు, చిరు కానుకలు సమర్పించి, అందరూ కలసి చక్కని విందు సేవిస్తారు. పూర్వం భర్తలకు భార్యలు కూడా రాఖీలు కట్టే ఆచారంలో అమల్లో ఉండగా, ప్రస్తుతం ఎక్కువగా సోదరులకు సోదరి మాత్రమే రాఖీలు కట్టడం జరుగుతోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తలచిన మాత్రాన ముక్తినిచ్చే కార్తీక జ్యోతి
సత్సంతానాన్ని ప్రసాదించే సుబ్రహ్యణ్యేశ్వరుడు
తులసి ఆకులను కోసేటప్పుడు...
త్రిమూర్తుల నిలయం తులసి
కార్తీక సోమవార ప్రత్యేకత
శివకేశవులకు ప్రీతిపాత్రం కార్తీక వ్రతం
వినోదం
షూటింగ్ ముచ్చట్లు - శ్రీకాంత్ హీరోగా, మీరా జాస్మిన్, రీమా సేన్ హీరోయిన్లుగా ప్రేమ్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అమితాబ్‌కు గుండు గెటప్
నిన్న మొన్నటి వరకు సినిమాల్లో పొడవాటి జుట్టు ప్రధాన పాత్ర వహించగా, ప్రస్తుతం ట్రెండ్...
బ్రహ్మానందంతో బ్రూస్‌లీ ఫైట్స్
ఆమె లేకుండా ఊహించలేకపోతున్నా: వర్మ
సాహిత్యం
కవితలు - వెలుగురేఖ రైలు చుక్కై ఆకాశంలోకి ఎగిరిపోయిందో...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace