భగవంతుడు సృష్టించిన సకల చరాచర జగత్తులో మనిషి ఒక అద్భుతం. మనిషి అంటే శరీరం, మనసు, ఆత్మ అనే మూడు అంశాల కలబోత. భగవంతుడు సృష్టించిన ఈ శరీరమే ఒక రథంగాను, దానిలో అమరి ఉండేది ఆత్మగాను, మనసు దానిని నడిపించే చోదకుడిగాను ఆధ్యాత్మిక పురాణాలు చెబుతున్నాయి.
శరీరం అది బాహ్య ప్రపంచానికి కనిపించేది. మనిషి మనికీ, శరీరాల్లో ఎన్ని మార్పులు, ఎన్నెన్ని పోలికలు... ముక్కు, ముక్కు, వెంట్రుకలు, రంగు,.. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు.
అందరికి శరీరంలోపలి అవయవాల అమరిక ఒకటిగానే ఉన్నప్పటికీ బయట ఎన్నెన్నో మార్పులు. రంగులో అయితే ఉష్ణోగ్రత, చలి ప్రాంతాలను బట్టి వివిధ దేశాల్లో నివసిస్తున్న వారిలో మార్పు కనిపిస్తుంది.
మనసులో రెండు రకాలు మంచి, చెడు మనసులు. అయితే ప్రతి పనిలోను, విషయంలోను, మంచి, చెడు రెండూ ఉంటాయని, మన ఆలోచనను బట్టే మంచి, చెడులు నిర్ణయించబడుతాయని వేదాంతం తెలుపుతోంది.
ఇక పోతే ఆత్మ, దేవుడు ఇచ్చిన శరీరాన్ని నడిపించేదే ఆత్మ, మనస్సుతో ఆత్మను, శరీరాన్ని అదులో ఉంచుకున్నవాడే ఈ ప్రపంచాన్ని జయించగలడు.
|