|
| మానవ జీవితంపై గురువు ప్రభావం | |
మానవుని జీవితంపై గురువు ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. లాలనలో తల్లిలా, వాత్సల్యంలో తండ్రిలా వ్యవహరిస్తాడు. అమ్మ ఒడి మొదటి బడి అన్నారు. మాతృమూర్తి వద్ద ఓనమాలు నేర్చుకున్న తర్వాత గురువు వద్ద శిష్యరికానికి చేరుతారు.
శిష్యుని శ్రేయస్సు కోరడం ద్వారా గురువు పాత్ర పరిపూర్ణమవుతోంది. పుణ్యతీర్థాల దర్శనం ద్వారా లభించే పుణ్యాన్ని మంచి గురువు వద్ద చేరి, ఆయన ప్రవచనాలను వినడంతో పొందవచ్చని వేద పురాణాలలో చెప్పబడింది.
గురువు వద్ద శ్రద్ధాశక్తులతో విద్య నేర్చుకునే వారు ఖచ్చితంగా జీవితంలో పైకెదుగుతారన్న విషయాన్ని పలువురి మేధావుల జీవితాల నుంచి కూడా తెలుసుకోవచ్చు.
మనలో కొంత మంది వివిధ పేర్లతో ఉన్న దేవుళ్లను పూజిస్తారు. కొంత మంది రాముని, మరి కొంత మంది కృష్ణుని, అల్లా, క్రీస్తు, దేవీలను పూజిస్తారు. అయితే కంటికి కన్పించే దేవుళ్లలో గురువు కూడా ఒకరని తెలుసుకోవాలి.
గురువులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. త్రేతా యుగంలో శ్రీరాముడు కుల గురువైన వశిష్ఠుల వారి వద్ద విద్యనభ్యశించాడు. అంతే గాక విశ్వామిత్రుడు తదితర గురువుల వద్ద విద్యాభ్యాసం చేసి శక్తులను నేర్చుకున్నాడు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - అల్లం రసం, తేనె సమపాళ్లలో తీసుకుని రోజుకు రెండు, మూడు సార్లు తీసుకుంటే... |
| |
|
|
|
|
|
|
|