|
| భద్రాచల క్షేత్ర మహత్యము | |
పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసిన ఆ అయోధ్య రాముడు భక్తుల పూజలందుకుంటూ కోరిన వరాలనిచ్చి కోదండ రామునిగా పేరు గాంచాడు. దశరధనందనుడైన శ్రీ రాముడు పితృవాక్య పరిపాలనకై సతీ సమేతుడై అడవులకేగి అరణ్యవాసం చేస్తున్న సమయంలో నివసించిన స్థలం ఈ భద్రాచలం.
పంచవటి అను పేరు గల ఈ స్థలంలో పర్ణశాలను నిర్మించుకున్న సీతారాములు సంతోషంగా తమ అరణ్యవాసాన్ని పూర్తిచేశారు. భద్రాచల క్షేత్ర పురాణం ఈ విధంగా ఉంది. త్రేతాయుగమున శ్రీరాముని అరణ్యవాస సమయంలో విశ్రాంతి పొందే శిలగా ఉండి ఆయన ప్రేమకు పాత్రుడై మరు జన్మలో మేరుపర్వతంగా జన్మించి రఘురాముడు వేలసిన భద్రగిరియై సాక్షాత్కారమును పొందాడు భద్రుడు.
భద్రుడు భక్తి శ్రద్దలతో తపమాచరించి రాముని సాక్షాత్కారాన్ని పొందాడు. తపస్సుతో మెప్పించిన భద్రుని కోర్కెను తెలుసుకొనుటకై ఏమి కావాలో కోరుకోమన్నాడు నీలమేఘశ్యాముడు. ఎల్లప్పుడూ తనకు పాదసేవ చేస్తూ తనలోనే ఐక్యం అవాలని కోరగా అందుకు భక్తవత్సలుడైన రఘురాముడు కలియుగములో సీతాసమేతుడై తన పై కొలువుతీరనున్నామని తెలిపాడు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|