|
| మామిడి కాయ పచ్చడి
| |
కావలసిన పదార్థాలు: ఓ పుల్లని మామిడి కాయ, కప్పు కొబ్బరితురుము, నాలుగు పచ్చిమిరపకాయలు, 25 గ్రాముల పచ్చిశనగ పప్పు, కొద్దిగా మెంతులు, చిటికెడు ఇంగువ, టీస్పూన్ ఆవాలు, కొద్దిగా కొత్తిమీర, 25 గ్రాముల నూనె, తగినంత ఉప్పు.
తయారుచేయు విధానం: ముందుగా పచ్చిశనగ పప్పును వేయించి, మామిడికాయను తురుముకుని పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక మెంతులు, ఇంగువ, పచ్చిమిరపకాయ ముక్కలను వేసి వేయించాలి.
అందులో మామిడి తురుము కూడా వేసి కాసేపు వేగాక తగినంత ఉప్పు వేసి, వేయించి పెట్టుకున్న పచ్చిశెనగపప్పును కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో కొత్తిమీర వేసి పోపు పెట్టి అన్నం లేదా దోసతో సర్వ్ చేయాలి.
తిరుపతికి చెందిన గృహిణి అయిన గోపాల కృష్ణమ్మ బీఏ వరకు చదువుకున్నారు. ప్రత్యేక మైన వంటలు చేయడం, హస్త కళలు, చిత్ర లేఖనం ఆమె ప్రధాన అభిరుచులు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని మందవెలిపాక్కంలో నివసిస్తున్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|