|
| భద్రతా పరిస్థితి పరిశీలనకు సీజీఎఫ్ బృందం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 7 జనవరి 2009 ( 11:04 IST ) | |
కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీజీఎఫ్) భద్రతా బృందం త్వరలో భారత పర్యటనకు రానుంది. ముంబయిలో ఇటీవల ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో, సీజీఎఫ్ బృందం ఇక్కడి భద్రతా పరిస్థితులను పరిశీలించనుంది. క్రీడాకారుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను ఈ బృందం సూచిస్తుందని భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షుడు సురేష్ కల్మాడీ తెలిపారు.
ఢిల్లీలో 2010లో జరిగే కామన్వెల్త్ క్రీడల కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టామని చెప్పారు. భద్రత ఎప్పుడూ ఆందోళకపరిచే అంశమే. పూణేలో జరిగిన యువజన కామన్వెల్త్ క్రీడలకు సరైన ఏర్పాట్లు చేశాము. ఢిల్లీలో మరిన్ని చర్యలు తీసుకుంటామని కల్మాడీ వివరించారు. క్రీడాకారులకు 100 శాతం భద్రత కల్పించేందుకు అవసరమైన పరికరాలు కూడా సమకూర్చుకుంటున్నామని తెలిపారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|