|
| రంజీ సెమీస్: పటిష్ట స్థితిలో ముంబయి, తమిళనాడు |
| చెన్నై, సోమవారం, 5 జనవరి 2009 ( 10:31 IST ) | |
రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్లలో తమిళనాడు, ముంబయి జట్లు పటిష్ట స్థితిలో నిలిచాయి. నాగ్పూర్లో యూపీతో జరిగే మ్యాచ్లో తమిళనాడు తొలి రోజు ఆట ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా, చెన్నైలో సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్లో ముంబయి ఓ వికెట్ నష్టానికి 268 పరుగులు చేసింది.
తమిళనాడు జట్టులో ఓపెనర్ అభినవ్ ముకుంద్ (100), ఎం విజయ్ (69)లు తొలి వికెట్కు 167 పరుగులు జోడించిన తర్వాత 15 పరుగుల వ్యవధిలో అవుటయ్యారు. అయితే ఆ తర్వాత బద్రినాథ్ (59), కెప్టెన్ దినేష్ కార్తిక్ (58) మూడో వికెట్కు అజేయంగా 114 పరుగులు జోడించారు.
మరోవైపు సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్లో తొలి వికెట్కు వినాయక్ సామంత్ (49)తో కలిసి 91 పరుగులు జోడించిన వాసిం జాఫర్ (162 నాటౌట్) ఆ తర్వాత సెంచరీ చేయడంతో పాటు రెండో వికెట్కు రహానే (52 నాటౌట్)తో కలిసి అజేయంగా 177 పరుగులు చేర్చాడు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|