|
| భారత్ టూర్కు ఇంగ్లాండ్ జట్టు రెడీ |
| లండన్ (ఏజెన్సీ), గురువారం, 4 డిసెంబర్ 2008 ( 11:21 IST ) | |
భారత్ టూర్కు ఇంగ్లాండ్ జట్టు సిద్ధమవుతోంది. భారత్తో రెండు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు అబుదాబి మార్గంలో వచ్చేందుకు ఇంగ్లాండ్ సరంజామా సర్దుకుంటోంది. గురువారం అబుదాబి రానున్న ఇంగ్లాండ్ జట్టు అక్కడ ప్రాక్టీసు చేసిన తర్వాత వచ్చే వారం ప్రారంభంలో భారత్ వస్తుంది.
అయితే భద్రతా సిఫార్సులకోసం వేచి చూస్తున్నామని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ వెబ్సైట్ ద్వారా తెలిపింది. అయితే ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఈసీబీ క్రికెట్ బోర్డు భద్రతా సలహాదారు రెగ్ డికాసన్ చెన్నై వేదికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బుధవారం ఆయన చెన్నైలోని చిదంబర్ స్టేడియంను పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ తనకు ఉన్న అనుమానాలను పోలీసు అధికారులు నివృత్తి చేశారన్నారు. తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్న బీసీసీఐ కార్యదర్శి శ్రీనివాసన్, నగర పోలీస్ కమిషనర్ రాధాకృష్ణన్లు కూడా ఆయనతో చర్చలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|