యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
పఠాన్ బ్రదర్స్ జోరుతో బరోడా గెలుపు
వడోదరా, బుధవారం, 3 డిసెంబర్ 2008   ( 09:49 IST )
పఠాన్ సోదరులు సకాలంలో ఆదుకోవడంతో మహారాష్ట్రతో జరిగిన రంజీ మ్యాచ్‌లో బరోడా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మహారాష్ట్ర నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓ దశలో 75 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బరోడాను పఠాన్ సోదరులు తమ బ్యాటింగ్ ప్రతిభతో గెలుపుబాటన నడిపారు.

యూసుఫ్ పఠాన్ సరిగ్గా సెంచరీ చేసి వెనుదిరగ్గా, ఇర్ఫాన్ పఠాన్ యాభై పరుగులతో అజేయంగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ వీరిద్దరూ క్రమంగా 58, 51 పరుగులు చేయడం గమనార్హం. అంతకుముందు మహారాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులు చేసి, ఆలౌటైంది. మునాఫ్ పటేల్, రాజేష్ పవార్‌లు నాలుగేసి వికెట్లు దక్కించుకోగా, పఠాన్ సోదరులు చెరో వికెట్ పడగొట్టారు.

ఈ విజయం ద్వారా ఐదు పాయింట్లు కూడగట్టుకున్న బరోడా తన పాయింట్ల సంఖ్యను తొమ్మిదికి పెంచుకున్నప్పటికీ, సెమీస్ చేరే అవకాశాలను మాత్రం దాదాపుగా కోల్పోయిన పరిస్థితే కన్పిస్తోంది. మరోవైపు మహారాష్ట్ర కేవలం నాలుగు పాయింట్లతో చివరి స్థానం కోసం ఆంధ్రతో పోటీపడుతోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
హైదరాబాద్‌పై జాఫర్ అజేయ డబుల్ సెంచరీ
చెన్నై ఓపెన్‌కు డావిడెంకో, బ్రయాన్ సోదరులు
రంజీలో రాజస్థాన్‌పై సౌరాష్ట్ర ఇన్నింగ్స్ విజయం
ఆంధ్రపై ఆధిక్యం దిశగా తమిళనాడు జోరు
గంగూలీ నాయకత్వంపై షేన్ వార్న్ చురకలు
ఇంగ్లాండ్‌తో చెన్నై, మొహాలీలలో టెస్టులు: బీసీసీఐ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...