|
| ఆంధ్రపై ఆధిక్యం దిశగా తమిళనాడు జోరు |
| విజయవాడ, మంగళవారం, 2 డిసెంబర్ 2008 ( 11:18 IST ) | |
విజయవాడలో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఆంధ్రపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించే దిశగా తమిళనాడు జోరు కోనసాగిస్తోంది. ఆంధ్రను 283 పరుగులకు ఆలౌట్ చేసిన తమిళనాడు మూడో రోజు ఆటముగిసేసరికి ఓ వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. ఇటీవలే టెస్టు అరంగేట్రం చేసిన విజయ్ (0) ప్రారంభంలోనే నిష్క్రమించినప్పటికీ, ముకుంద్ (72), బద్రినాథ్ (54)లు జట్టు స్కోరును ముందుకు తీసుకువెళుతున్నారు.
మరో మ్యాచ్లో పంజాబ్పై గుజరాత్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో పంజాబ్పై 163 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకున్న గుజరాత్ రెండో ఇన్నింగ్స్లో సైతం ఆ జట్టును 192 పరుగులకే ఆలౌట్ చేసింది. తద్వారా 30 పరుగుల విజయలక్ష్యాన్ని వికెట్టు నష్టపోకుండా ఛేదించి, ఆరు పాయింట్లను ఖాతాలో వేసుకుంది.
ఒరిస్సాతో జరిగిన రంజీ మ్యాచ్లో ఢిల్లీ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో రెండు పరుగుల ఆధిక్యం సాధించిన ఒరిస్సా అదే ఊపును కొనసాగించలేకపోయింది. రెండో ఇన్నింగ్స్లో 150 పరుగులు చేసిన ఢిల్లీ అనంతరం ఒరిస్సాను 96 పరుగులకే చిత్తు చేసి, విజయాన్ని సొంతం చేసుకుంది. ఇశాంత్ శర్మ 11 వికెట్లు పడగొట్టి ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|