|
| ఇంగ్లాండ్తో చెన్నై, మొహాలీలలో టెస్టులు: బీసీసీఐ |
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ను చెన్నై, మొహాలీలలో నిర్వహించాలని నిర్ణయించామని బీసీసీఐ కార్యదర్శి శ్రీనివాసన్ తెలిపారు. తొలి టెస్టు చెన్నైలో డిసెంబర్ 11-15 తేదీల్లో, రెండో టెస్టు మొహాలీలో డిసెంబర్ 19-23 తేదీల్లో జరుగుతుందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
ముంబయి పేలుళ్ల కారణంగా వన్డే సిరీస్ను అర్ధాంతరంగా రద్దు చేసుకున్న ఇంగ్లాండ్ ఎట్టకేలకు టెస్టు సిరీస్లో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు దీనిపై తుది నిర్ణయం తీసుకునే ముందు భారత అధికారులతో చర్చలు జరిపేందుకై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు త్వరలో ఓ భద్రతా కన్సల్టంట్ను భారత్ పంపనుందన్నారు.
మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు చేశామన్నారు. తొలుత అహ్మదాబాద్, ముంబయిలలో ఈ టెస్టులు జరపాలని ప్రతిపాదించగా, పేలుళ్ల తర్వాత ముంబయి నుంచి చెన్నైకు మార్చుతున్నట్టు ప్రకటించిన బీసీసీఐ తాజాగా ఆ నిర్ణయాన్ని కూడా మార్చుకుని పూర్తిగా టూర్ వేదికలను మార్చింది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|