|
| డబుల్స్లోనూ సైనా ఓటమి: భట్ ముందంజ |
| బీజింగ్ (ఏజెన్సీ), శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 16:01 IST ) | |
చైనా ఓపెన్ సిరీస్లో ఇప్పటికే సింగిల్స్లో ఇంటిబాట పట్టిన సైనా నెహ్వాల్ డబుల్స్లోనూ నిష్క్రమించింది. అన్సీడెడ్గా బరిలో దిగిన సైనా- అన్నా రైస్ (కెనడా) జంట 13-21, 11-21 పాయింట్ల తేడాతో నాలుగో సీడ్ జంగ్ ఈన్- మింగ్ మిన్ జంగ్ కిమ్ జంట చేతిలో ఓటమి పాలైంది.
మరోవైపు పురుషుల సింగిల్స్లో అరవింద్ భట్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అతను రెండో రౌండ్లో 18-21, 21-18, 21-15 పాయింట్లతో పీటర్ కౌకల్ (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించాడు. సైనా నెహ్వాల్, చేతన్ ఆనంద్లు ఇంటిబాట పట్టడంతో భారత్ తరపున ఏకైక ఆశాకిరణంగా అరవింద్ భట్ నిలిచాడు.
సింగిల్స్లో సైనాపై తొలి రౌండ్లో ఐదో సీడ్ క్రీడాకారిణి లిన్ జు (చైనా) 53 నిమిషాల్లో 6-21, 21-12, 19-21 సెట్లతో విజయం సాధించగా, మలేషియాకు చెందిన చూంగ్ హాన్ వాంగ్ కేవలం 26 నిమిషాల్లో 21-10, 21-14 సెట్ల తేడాతో విజయం సాధించాడు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|