యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఆసక్తికరంగా ఆసీస్-కివీస్ తొలి టెస్టు
బ్రిస్బేన్, 21 నవంబర్ 2008   ( 11:27 IST )
బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా- న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజునే ఫలితం తేల్చే దశకు చేరుకుంది. ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకున్న న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి ఆసీస్‌కు తమ బౌలర్ల దెబ్బను రుచి చూపింది.

న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి నిలబడలేకపోయిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. తద్వారా తన ఆధిక్యాన్ని 189 పరుగులకు పెంచుకుంది. ఆసీస్ జట్టులో ఓపెనర్ కటీచ్ (67) ఒంటరి పోరు చేస్తుండగా, హాడిన్(6)అతనికి తోడుగా క్రీజుపై ఉన్నాడు. కివీస్ బౌలర్లలో మార్టిన్ మూడు వికెట్లు పడగొట్టగా, ఓ బ్రెయిన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

అంతకుముందు టేలర్ (40), రైడర్ (30), ఫ్లిన్ (39 నాటౌట్)లు మినహా మరెవ్వరూ రాణించకపోవడంతో న్యూజిలాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో జాన్సన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, బ్రెట్ లీ, స్టూవర్ట్ క్లార్క్, షేన్ వాట్సన్‌లు తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ప్రోటీస్‌తో టెస్టులో ఓటమి అంచున బంగ్లా
శ్రీలంక స్పిన్‌ బౌలింగ్‌తో జింబాబ్వే చిత్తు
వన్డే జట్టులోకి తిరిగి సచిన్, పఠాన్
కాన్పూర్ వన్డేలోనూ గెలుపు భారత్‌దే
బీసీసీఐ టెక్నికల్ కమిటీలో గంగూలీ
కాన్పూర్ వన్డేలో భారత్ లక్ష్యం 241
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ
"మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క శివాజీతో "డైరీ" అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రద్ధాదాస్...
24న "దొంగలబండి" ఆడియో ఆవిష్కరణ
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...