|
| భారత్ టూర్పై 12 రోజుల్లో నిర్ణయం: పీసీబీ |
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), బుధవారం, 19 నవంబర్ 2008 ( 11:44 IST ) | |
తమ దేశంలో భారత్ వచ్చే ఏడాది ప్రారంభంలో తలపెట్టిన టూర్పై పది, పన్నెండు రోజుల్లో తుది నిర్ణయం వెల్లడి కాగలదని పాక్ క్రికెట్ బోర్డు పేర్కొంది. భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్టు బీసీసీఐ నుంచి సమాచారం అందిందని పీసీబీ చీఫ్ ఇజాజ్ బట్ తెలిపారు.
ఈ మేరకు పీసీబీ ఓ ప్రకటన విడుదల చేస్తూ భారత క్రికెట్ బోర్డు చీఫ్ శశాంక్ మనోహర్తో బట్ ఫోన్ సంభాషణ జరిపిన మయంలో ఈ పర్యటనకు సంబంధించి ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన బట్తో అన్నారని వెల్లడించారు.
ఇదివరకే ఇరు బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు జనవరి 20నుంచి పాక్లో పర్యటించనున్న భారత జట్టు మూడు టెస్టులు, ఐదు వన్డేలతో పాటు ఓ ట్వంటీ 20 మ్యాచ్లో తలపడాల్సి ఉంది. అయితే ఇటీవల పాకిస్థాన్తో జూనియర్ హాకీ జట్టు పర్యటనను భారత ప్రభుత్వం భద్రతా కారణాలతో రద్దు చేసిన దృష్ట్యా టీం ఇండియా టూర్ సందిగ్ధంలో పడింది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|