|
| షెడ్యూల్ ప్రకారమే తొలి టెస్టు: మోడీ |
| ముంబయి (ఏజెన్సీ), బుధవారం, 19 నవంబర్ 2008 ( 11:32 IST ) | |
ఇంగ్లాండ్తో జరిగే తొలి టెస్టును షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు లలిత్ మోడి ప్రకటించారు. ఛాంపియన్ లీగ్ ఫైనల్లో దోనీ పాల్గొనేందుకు వీలు కల్పించేలా తొలి టెస్టును వాయిదా వేయాలనుకోవడం లేదని తేల్చి చెప్పారు.
ఛాంపియన్స్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్కు సారధ్యం వహిస్తున్న ధోనీ ఆ జట్టు ఫైనల్కు చేరే పక్షంలో ఆడేందుకు వీలుగా ఇంగ్లాండ్తో తొలి టెస్టును ఓ రోజు వెనక్కునెట్టాలని ప్రతిపాదన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనను మోడి కొట్టి పారేశారు.
చెన్నై సూపర్ కింగ్స్ పైనల్ చేరడాన్ని ఇప్పుడే ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. ఒకవేళ పైనల్ చేరినా దోనీ ప్రాధాన్యం డిసెంబర్ 10న జరిగే ఛాంపియన్ లీగ్ ఫైనల్లో పాల్గొనడం కన్నా 11-15 తేదీల్లో జరిగే టెస్టులో పాల్గొనడంపైనే ఉండగలదన్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|