|
| హైదరాబాద్పై గుజరాత్ భారీ స్కోరు |
| హైదరాబాద్, మంగళవారం, 18 నవంబర్ 2008 ( 10:31 IST ) | |
నీలేష్ మోడీ అజేయ డబుల్ సెంచరీ (250)తో హైదరాబాద్తో జరిగే రంజీ మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోరు నమోదు చేసుకుంది. గుజరాత్ మొదటి ఇన్నింగ్స్ను 9 వికెట్ల నష్టానికి 520 వద్ద డిక్లేర్ చేయగా, హైదరాబాద్ రెండోరోజు ఆట ముగిసేసరికి ఓ వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది.
మరోవైపు భారీ స్కోరు దిశగా పయనిస్తున్న ముంబయిని కేవలం 35 పరుగుల తేడాతో చివరి ఎనిమిది వికెట్లను పడగొట్టడం ద్వారా 330కు ఆలౌట్ చేసిన ఢిల్లీ రెండో రోజు ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. మన్హాస్ 72, భాటియా 45 పరుగులతో క్రీజులో ఉన్నారు.
అలాగే మరో మ్యాచ్లో పంజాబ్ చేసిన 482 పరుగుల తొలి ఇన్నింగ్స్ స్కోరుకు సమాధానంగా సౌరాష్ట్ర రెండో రోజు ఆట ముగిసేసరికి ఓ వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. పంజాబ్ జట్టులో ఇందర్ సింగ్ 114, సోహల్ 103 పరుగులు చేశారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|