|
| చెస్ ఒలింపియాడ్లో రష్యాతో మహిళల డ్రా |
| డ్రెస్డెన్ (ఏజెన్సీ), సోమవారం, 17 నవంబర్ 2008 ( 12:07 IST ) | |
జర్మనీలోని డ్రెస్డెన్లో జరిగే 32న చెస్ ఒలింపియాడ్లో భారత మహిళల జట్టు టాప్ సీడ్ రష్యాతో డ్రా చేసుకుంది. తెలుగు తేజం ద్రోణవల్లి హారిక, నిషా మొహతాలు ఓటమిపాలైనప్పటికీ, తానియా సచ్దేవ్, స్వాతిఘటేలు రాణించడంతో భారత్ డ్రా చేసుకోగలిగింది.
మహిళల ప్రపంచ ఛాంపియన్ అలెగ్జాండ్రా కోస్టెనియుక్ చేతిలో హారిక ఓటమి పాలవగా, నదేజ్దా కోసిన్ట్సేవా చేతిలో నిషా మొహతా చిత్తయింది. అయితే తాతియానాను హారిక, ఎకతరీనా కోర్బుట్ను స్వాతి ఘటేలు ఓడించడం ద్వారా డ్రా చేశారు. అగ్రశ్రేణి క్రీడాకారిణి కోనేరు హంపి లేకున్నా టాప్ సీడ్తో భారత మహిళలు డ్రా చేయడం గమనార్హం.
మరోవైపు ఎల్ సాల్వాడార్ జట్టును ఓడించడం ద్వారా భారత పురుషుల జట్టు ఆరు పాయింట్లతో రష్యా, ఆర్మేనియా, జర్మనీ, స్పెయిన్, ఉక్రైన్, నార్వే, ఇంగ్లాండ్, రుమేనియాలతో సంయుక్త అగ్రస్థానం సాధించింది. తర్వాతి రౌండ్లో రష్యాతో తలపడాల్సి ఉండటం గమనార్హం.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|