యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
జాన్సన్ దెబ్బకు భారత్‌ విలవిల: 106/4
బెంగళూరు, శనివారం, 11 అక్టోబర్ 2008   ( 11:09 IST )
బెంగళూరులో జరిగే తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు ధీటైన సమాధనం ఇచ్చేలా భారత ఓపెనర్లు అందించిన శుభారంభం నీరుగారిపోయింది. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే ఓపెనర్లు గంభీర్, సెహ్వాగ్‌లు నిష్క్రమించగా, ఆ వెంటనే సచిన్, లక్ష్మణ్‌లు కూడా పెవిలియన్ బాట పట్టారు.

గంభీర్ (21)ను బ్రెట్ లీ ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔట్ చేయగా, సెహ్వాగ్ (45), సచిన్ (13), లక్ష్మణ్ (13)లను జాన్సన్ బయటకు పంపాడు. తాజా వార్తల ప్రకారం భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేయగా, రాహుల్ ద్రావిడ్ (18), గంగూలీ (0)లు క్రీజ్‌లో ఉన్నారు.

ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ 430 పరుగుల వద్ద ముగిసింది. ఆ జట్టులో కెప్టెన్ పాంటింగ్ (123), హస్సీ (146)లు సెంచరీలు చేయగా, కటీచ్ (66), హాడిన్ (33), బ్రెట్ లీ (27)లు కూడా వారికి చక్కటి సహకారం అందించారు. భారత బౌలర్లలో జహీర్ ఐదు, ఇశాంత్ నాలుగు వికెట్లు దక్కించుకోగా, హర్భజన్ ఓ వికెట్ పడగొట్టాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జెలీనాతో సెమీస్ పోరుకు ఎలీనా రెడీ
క్రెమ్లిన్ కప్: డావిడెంకోకు సఫిన్ షాక్
ఆసీస్ 430 ఆలౌట్: భారత్‌కు ఓపెనర్ల శుభారంభం
ఆసీస్ ఇన్నింగ్స్‌కు 430 వద్ద జహీర్‌ఖాన్ తెర
ఎనిమిది ర్యాంకులు ఎగబాకిన చేతన్ ఆనంద్
క్రెమ్లిన్ కప్ టెన్నిస్ టోర్నీ క్వార్టర్స్‌లో జంకోవిచ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...