|
| ఎనిమిది ర్యాంకులు ఎగబాకిన చేతన్ ఆనంద్ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 10 అక్టోబర్ 2008 ( 14:55 IST ) | |
వరుస విజయాలతో తాజా బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో జాతీయ ఛాంపియన్ చేతన్ ఆనంద్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 22వ ర్యాంకుకు చేరుకున్నాడు. గత నెలలో చెక్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకున్న చేతన్ గత వారం జర్మనీలో జరిగిన బిట్బగర్ టోర్నీని సైతం గెలుచుకున్న సంగతి తెలిసిందే.
ఈ విజయాల ప్రభావం కూడా పడటంతో పాయింట్ల సంఖ్య 35750కు పెరగడంతో పాటు ర్యాంకింగ్స్లో మరింత ముందుకు దూసుకెళ్లగలిగాడు. బిట్ బగర్ టోర్నీని గెలవడం ద్వారా గ్రాండ్ ప్రి పోటీలో గెలిచిన తొలి భారతీయుడనే ఘనతను కూడా చేతన్ దక్కించుకున్నాడు.
మరోవైపు అదే టోర్నీలో రన్నరప్గా నిలిచిన అర్వింద్ భట్ 29037 పాయింట్లతో 36వ ర్యాంకులో నిలవగా, అనుప్ శ్రీధర్ 37వ స్థానానికి పడిపోయాడు. అలాగే మిక్స్డ్ డబుల్స్లో గ్రాండ్ ప్రీ టైటిల్ సాధించిన తొలి భారత జంట దిజు- జ్వాలా గుత్తాలు సైతం 25 ర్యాంకులు ఎగబాకి, 55వ స్థానానికి చేరుకున్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|