|
| డబుల్స్ స్వర్ణం అందుకున్న విలియమ్స్ సోదరీమణులు |
| బీజింగ్, 17 ఆగస్టు 2008 ( 17:15 IST ) | |
బీజింగ్ విశ్వ క్రీడల్లో టెన్నిస్ డబుల్స్ స్వర్ణ పతకాన్ని విలియమ్స్ సోదరీమణులు అందుకున్నారు. అమెరికాకు చెందిన సెరీనా-వీనస్ విలియమ్స్లు 6-2, 6-0 సెట్ల తేడాతో జయభేరి మోగించారు. స్పెయిన్ తార అనెబెల్ మెడీనా-విరిజనా రువానో పాస్కల్లను చిత్తుగా ఓడించి ఒలింపిక్స్లో రెండోసారి స్వర్ణ పతకాన్ని విలియమ్స్ సిస్టర్స్ అందుకున్నారు.
మ్యాచ్ ఆరంభం నుంచి విలియమ్స్ సోదరీమణులు పదునైన షాట్లతో ప్రత్యర్ధిని ముప్పుతిప్పలు పెట్టారు. తొలి సెట్లో గారిక్స్-పాస్కల్లు ఒక మాదిరిగా పోటీనిచ్చినప్పటికీ దానిని చివరి వరకూ కొనసాగించలేకపోయారు. విలియమ్స్ సిస్టర్స్ తొలి సెట్ను 6-2 తేడాతో కైవసం చేసుకున్నారు.
మలి సెట్లో విలియమ్స్ సోదరీమణుల ఆధిపత్యం కొనసాగింది. దీనితో 6-0 తేడాతో విలియమ్స్ సిస్టర్స్ జయభేరి మోగించి టెన్నిస్ డబుల్స్ విభాగంలో ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని రెండసారి కైవసం చేసుకున్నారు. సిడ్నీ వేదికగా 2000 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్లో విలియమ్స్ సోదరీమణులు తొలిసారి డబుల్స్ స్వర్ణ పతకాన్ని అందుకున్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|