|
| వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన |
| ముంబయి (ఏజెన్సీ), గురువారం, 7 ఆగస్టు 2008 ( 15:22 IST ) | |
శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్తో పాటుగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత్ ఆతిథ్య జట్టుతో ఐదు వన్డేల సిరీస్ను ఆగస్టు 18వ తేదీ నుంచి ఆడుతుంది. భారత జట్టులోకి కొత్తగా అండర్-19 కెప్టెన్ విరాట్ కొహ్లిని ఎంపికచేయడం గమనార్హం.
భారత వన్డే జట్టులోకి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, పేసర్ జహీర్ ఖాన్లకు సెలక్టర్లు స్థానం కల్పించారు. పేసర్ ఇషాంత్ శర్మను శ్రీలంక వన్డే సిరీస్కి దూరంగా ఉంచారు. ఫాంతో తంటాలు పతుడున్న రాబిన్ ఉతప్పపై సెలక్టర్లు వేటువేశారు.
వన్డే సిరీస్కి భారత జట్టు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో సచిన్ టెండూల్కర్, గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, విరాట్ కొహ్లి, పార్ధివ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్, ప్రవీణ్ కుమార్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఆర్పీ సింగ్, మునాఫ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓఝాలు ఉన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో సచిన్, గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, విరాట్ కొహ్లి, ఇర్ఫాన్ పఠాన్, ప్రవీణ్ కుమార్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఆర్పీ సింగ్, ఇషాంత్ శర్మ, పర్జ్ఞాన్ ఓఝాలు ఉన్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|