|
| టీం ఇండియా కోచ్ కిర్స్టన్ దక్షిణాఫ్రికా పయనం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 6 ఆగస్టు 2008 ( 11:08 IST ) | |
టీం ఇండియా కోచ్ గ్యారీ కిర్స్టన్ శ్రీలంకతో కొలంబోలో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదు. కిర్స్టన్ తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయన దక్షిణాఫ్రికా వెళుతున్నారు. మంగళవారం రాత్రి కిర్స్టన్ దక్షిణాఫ్రికా బయలుదేరి వెళ్లారు.
ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. తల్లి అనారోగ్యం కారణంగా కిర్స్టన్ మూడో టెస్ట్ మ్యాచ్కు సేవలు అందించలేడని బీసీసీఐ తెలిపింది. అతని స్థానంలో వేరొకరిని పంపే ఉద్దేశ్యం లేదని బీసీసీఐ కార్యదర్శి నిరంజన్ షా స్పష్టం చేశారు.
శ్రీలంక- భారత్ మధ్య నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 8న కొలంబోలో ప్రారంభం కానుంది. తొలి టెస్ట్లో శ్రీలంక, రెండో టెస్ట్లో భారత్ విజయం సాధించడంతో సిరీస్ 1-1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|