|
| పోరాడి ఓడిన ప్రకాష్: ఫైనల్లో భారత జంట |
| అప్టోస్ (ఏజేన్సీ), శనివారం, 19 జులై 2008 ( 14:55 IST ) | |
అమెరికాలోని ఆప్టోస్లో జరిగే 75వేల డాలర్ల ఏటీపీ ఛాలెంజర్ టోర్నమెంట్లో ప్రకాష్ అమృత్ రాజ్ పోరాడి ఓటమిపాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో ఇటలీకి చెందిన స్టాపినీ 6-7, 7-5, 6-4తో ప్రకాష్ అమృత్ రాజ్పై విజయం సాధించాడు.
తొలి సెట్ గెలుచుకున్నప్పటికీ, రెండు, మూడో సెట్లలో మాత్రం ప్రత్యర్థి జోరుముందు ప్రకాష్ తలవంచక తప్పలేదు. అమెరికాకు చెందిన లెస్టర్ కుక్తో జట్టుకట్టిన ప్రకాష్ ఇప్పటికే డబుల్స్లో ఓటమిపాలవగా, ఈ పరాజయంతో ఆ టోర్నీ నుంచి నిష్క్రమించినట్లయింది.
మరోవైపు భారత్కు చెందిన నాలుగో సీడ్ జంట హర్ష్ మంకడ్- అశుతోష్ సింగ్ 5-7, 7-6, 10-4 సెట్లతో జోషువా గూడాల్ (బ్రిటన్)- మైఖేల్ రైడర్స్టెడ్ (స్వీడన్) జంటపై విజయం సాధించి, పైనల్లో ప్రవేశించారు. వారు టైటిల్ పోరులో ఆస్ట్రేలియాకు చెందిన టాప్ సీడ్ జంట ఆడం ఫీనీ- రాబర్ట్ స్మీట్స్లతో తలపడనున్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|