|
| శ్రీలంక బోర్డు లెవన్ 224 ఆలౌట్ |
భారత్తో కొలంబోలో జరిగే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ తొలి రోజున శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ లెవన్ జట్టు 224 పరుగులకు ఆలౌటైంది. కండంబీ (84), చమర సిల్వా (68)లు మినహా మరెవ్వరూ రాణించకపోవడంతో భారీ స్కోరు చేయాలనే ప్రయత్నంలో విజయం సాధించలేకపోయింది.
ఇరవై రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన లంక జట్టును కండంబితో కలిసి 82 పరుగుల వద్దకు తీసుకెళ్లిన సమయంలో ముబారక్ (25) నిష్క్రమించగా, 182 పరుగుల వద్ద కండంబి అవుటైన తర్వాత వికెట్ల పతనం కొనసాగింది.
భారత బౌలర్లలో కెప్టెన్ కుంబ్లే మూడు, హర్భజన్ సింగ్, జహీర్ఖాన్లు రెండేసి, ఇశాంత్, మునాఫ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్ గంభీర్ (4) వికెట్ కోల్పోయి నాలుగు పరుగులు చేసింది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|