|
| డీవై పాటిల్ స్టేడియానికి మారిన ఐపీఎల్ టోర్నీ ఫైనల్
|
| ముంబయి (ఏజెన్సీ), ఆదివారం, 11 మే 2008 ( 13:31 IST ) | |
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ముందుగా ప్రకటించిన మాదిరిగా వాంఖడే స్టేడియంలో కాకుండా నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనుంది. వివిధ కారణాలతో టోర్నీ ఫైనల్ వేదికను మార్చానని క్రికెట్ బోర్డు అధికారులు చెప్పారు.
టీవీ ప్రొడక్షన్ యూనిట్ సభ్యులు వాంఖడే స్టేడియంలో ఫైనల్ ఏర్పాట్లపై అంసతృప్తితో ఉండటమే ఇందుకు గల ఓ ప్రధాన కారణంగా తెలుస్తోంది. వాంఖడే స్టేడియాన్ని ఆధునీకరిస్తుండటంతో అక్కడ టీవీ ప్రొడక్షన్ పరికరాలు ఉంచేందుకు సరిపడ స్థలాన్ని కేటాయించడం సమస్యగా మారింది.
దీంతో ఫైనల్ మ్యాచ్ను ఇక్కడి నుంచి డీవై పాటిల్ స్టేడియాని మార్చారు. దీనికితోడు వాంఖడే స్టేడియం సామర్థ్యం 40 వేల మంది కాగా, డీవై స్టేడియం సామర్థ్యం 55 వేల మంది వరకు ఉంది. ఫైనల్ మ్యాచ్కు రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టేడియాల సామర్థ్యం కూడా వేదిక మార్పుకు కారణం అయింది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|