|
| బాలాజీ హ్యాట్రిక్: పంజాబ్ కింగ్స్పై చెన్నై కింగ్స్ విజయం
|
| చెన్నై (ఏజెన్సీ), 11 మే 2008 ( 12:47 IST ) | |
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్పై అతిథ్య జట్టు విజయం సాధించింది. తాజా మ్యాచ్ విజయంతో పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండో స్థానాన్ని ఆక్రమించింది.
ఈ మ్యాచ్లో టీం ఇండియాలో ఒకప్పటి బౌలర్ బాలాజీ హ్యాట్రిక్ నమోదు చేశాడు. బాలాజీ హ్యాట్రిక్తో పాటు మొత్తం ఐదు వికెట్లు పడగొట్టడంతో చెన్నై సూపర్ కింగ్స్ 18 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్పై విజయం సాధించింది.
182 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులే చేసింది. ప్రారంభం నుంచి ధాటిగా ఆడిన పంజాబ్ కింగ్స్ చివర్లో తడబడ్డారు. బాలాజీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్ను మలుపుతిప్పాడు.
ఇర్ఫాన్ పఠాన్ (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 40 పరుగులు) చివర్లో దూకుడు ప్రదర్శించాడు. అయినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. చివరి ఓవర్లో హ్యాట్రిక్ సాధించిన బాలాజీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|