|
| దక్కన్ ఛార్జర్స్పై రాజస్థాన్ రాయల్స్ అలవోక విజయం
|
| జైపూర్ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008 ( 09:49 IST ) | |
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో (ఐపీఎల్) భాగంగా శుక్రవారం రాత్రి ఇక్కడ జరిగిన 30వ లీగ్ మ్యాచ్లో దక్కన్ ఛార్జర్స్పై ఆతిథ్య జట్టు అలవోక విజయాన్ని సాధించింది. ఓపెనర్లు రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
దక్కన్ ఛార్జర్స్ ముందుంచిన 141 పరుగుల విజయలక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు 16 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే చేరుకుంది. ఓపెనర్లు గ్రేమ్ స్మిత్ (40), యూసఫ్ పఠాన్ (68) రాణించారు. జట్టు సునాయాస విజయానికి కారణమైన యూసఫ్ పఠాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
అంతకుముందు టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన దక్కన్ ఛార్జర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఓపెనర్, కెప్టెన్ గిల్క్రిస్ట్ (61) చెలరేగి ఆడినప్పటికీ, మిగిలిన బ్యాట్స్మెన్ పెద్దగా రాణించలేకపోయారు. షేన్ వార్న్, త్రివేది ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|