|
| రాజస్థాన్ రాయల్స్పై ముంబయి ఇండియన్స్ విజయం
|
| ముంబయి (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008 ( 09:07 IST ) | |
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా బుధవారం రాత్రి ఇక్కడ జరిగిన 27వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఆతిథ్య జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ 15.1 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
ఓపెనర్ తక్వాలే (27), ఉతప్ప (34) రాణించి జట్టుకు సునాయస విజయాన్ని అందించారు. అంతకుముందు టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 16.2 ఓవర్లలో 103 పరుగులే చేసి ఆలౌటయింది.
అష్నోద్కర్ (39), వాట్సన్ (32) రాణించినప్పటికీ మిగిలిన బ్యాట్స్మెన్ ఎవరూ సరిగా ఆడకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ ప్రత్యర్థి ముందు స్వల్ప విజయలక్ష్యాన్నే ఉంచగలిగింది. మూడు వికెట్లు పడగొట్టిన ముంబయి ఇండియన్స్ బౌలర్ల నెహ్రా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|