యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
అధికారమిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు: వైఎస్
గురువారం, 21 మే 2009   ( 08:39 IST )
రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించిన ప్రజలకు కృతజ్ఞతలని ముఖ్యమంత్రి వైఎస్ తెలిపారు. భారతదేశంలో ఏ రాష్ట్రమూ ఇవ్వని అత్యంత గొప్ప శక్తిని ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్‌కు అందించారని పేర్కొన్న వైఎస్ మొత్తం 42 లోక్‌సభ స్థానాలకుగాను 33 స్థానాలను అందించినందుకు తాను ఏమిచ్చి రుణం తీర్చుకోగలనంటూ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో లాల్ బహదూర్ స్టేడియంలో బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వైఎస్ పై విధంగా స్పందించారు. వరుసగా రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంగా ప్రజలనుద్ధేశించి ప్రసంగించిన వైఎస్ ప్రసంగం ఆద్యంతం ప్రజలు తమ ప్రభుత్వానికి మరోసారి అధికారాన్ని కట్టబెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపే విధంగానే సాగింది.

రాష్ట్ర అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికలు పాలక ప్రభుత్వ నమ్మకానికి, విపక్షాల మోసానికి మధ్య జరిగిన పోరుగా అభివర్ణించిన వైఎస్ ఇందులో ప్రజలు తమ పక్షానే నిలవడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ప్రజలను మరింతగా ఆకట్టుకునే దిశగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు బియ్యం కోటాను పెంచే ఫైలు పైన, ఉచిత కరెంటు సరఫరాను పెంచే ఫైలుపైనా ఆయన తన తొలి సంతకాన్ని చేశారు. దీనిప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న బియ్యం 20 కేజీలనుంచి 30 కేజీలకు పెరగనుండగా, వ్యవసాయానికి ఏడుగంటలపాటు ఇస్తున్న ఉచిత విద్యుత్ ఇకనుంచి తొమ్మిది గంటలపాటు సరఫరా కానుంది.

అటుపై పైఎస్ మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ఏకరువు పెట్టారు. గత ఐదేళ్లలో కొనసాగించిన ఈ సంక్షేమ పథకాలను రానున్న రోజుల్లోనూ అదే విధంగానూ, మరింత నిబద్ధతతోనూ కొనసాగించనున్నట్టు హామీ ఇచ్చారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం: ఎర్రన్నాయుడు
నదిలోపడ్డ వాహనం: 15మంది గల్లంతు
ఏసీబీ వలలో పంచాయితీ కార్యదర్శి
రేపు టీడీఎల్పీ సమావేశానికి రానున్న బాబు
అక్రమ ప్రమోషన్లపై చర్యకు అధికారులు సిద్ధం
విడుదలను కోరుతూ జైళ్లలో ఖైదీల ఆందోళన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...