|
| భోలక్పూర్ ఘటన: అధికారులు సీఎం అసహనం |
| హైదరాబాద్, 7 మే 2009 ( 15:27 IST ) | |
బోలక్పూర్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురువారం అధికారులు, మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని, ఇందులో అధికారిక యంత్రాంగం వైఫల్యం ఉందని తెలియడంతో వారిపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భోలక్పూర్లో కలుషిత నీరుతాగి మృతి చెందినవారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయాల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా సమీక్షా సమావేశానికి మంత్రులు వనమా, గల్లా అరుణకుమారి, రోశయ్య, కోనేరు రంగారావు, జీవన్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రభుత్వ సలహాదారు కేవీపీ, ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|