|
| ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: నాగం |
| హైదరాబాద్, 6 మే 2009 ( 18:07 IST ) | |
భోలక్పూర్ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నాగం జనార్థనరెడ్డి విమర్శించారు. భోలక్పూర్ ఘటనలో ఇంతమంది అస్వస్థతతకు గురైనా జలమండలి ఎండీ, ముఖ్యమంత్రి వైఎస్లు విహారయాత్రల్లో గడపడం ఏంటని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.
భోలక్పూర్ ఘటనలో అస్వస్థతకు గురై గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను నాగం జనార్ధనరెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. భోలక్పూర్ ఘటనకు పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్న ఆయన ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా తగిన కారణాలను కనుగొనలేదంటూ విమర్శించారు.
భోలక్పూర్ ఘటన జరిగి ఒకరోజు పూర్తికావస్తున్నా ఇంకా ప్రజలు ఆస్పత్రికి వస్తూనే ఉండడాన్ని బట్టి సమస్య తీవ్రత అర్థమవుతోందంటూ ఆయన పేర్కొన్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|