|
| ఆర్టీసీకి మరోసారి లాభాలు: దినేశ్రెడ్డి |
| హైదరాబాద్, బుధవారం, 6 మే 2009 ( 11:59 IST ) | |
గత రెండేళ్లుగా వరుసగా లాభాలను ఆర్జిస్తోన్న ఆర్టీసీ ఈ ఏడాది కూడా రూ. 100 కోట్ల లాభాన్ని ఆర్జించిందని సంస్థ ఎండీ దినేశ్రెడ్డి తెలిపారు. 2008-09 సంవత్సరానికిగాను ఫిబ్రవరి వరకు సంస్థ ఈ లాభాన్ని ఆర్జించినట్టు ఆయన తెలిపారు. దీంతోపాటు సంస్థ మరెన్నో అంశాల్లోనూ చెప్పుకోదగ్గ పురోగతి సాధించినట్టు ఆయన పేర్కొన్నారు.
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది సాధించిన లాభాల కారణంగా ఆర్టీసీ టర్నోవర్ రూ. 4457 కోట్లనుంచి రూ. 5032 కోట్లకు చేరిందని ఆయన తెలిపారు. అలాగే సంస్థ ఆక్యుపెన్సీ రేషియో సైతం 69 శాతం నుంచి 72 శాతానికి పెరిగిందని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో దాదాపు 1500 అత్యాధునికమైన ఆర్టీసీ బస్సులను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్టు ఆయన చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ పట్టణ పునరుద్ధరణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 360 కోట్ల నిధులతో ఈ బస్సులను కొనుగోలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|