|
| రాజారెడ్డి హత్యకేసు: 11మందికి జీవిత ఖైదు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 6 మే 2009 ( 11:37 IST ) | |
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్య కేసుతో సంబంధమున్న 11మందికి సుప్రీం కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఈ 11మందిలో నలుగురు ఇప్పటికే మరో కేసులో శిక్ష అనుభవిస్తున్నారు.
సుప్రీంకోర్టు జీవిత ఖైదును విధించినవారిలో పెర్ల సోమశేఖర రెడ్డి, ఒడ్డెరపు ఓబయ్య, పెర్ల శేషారెడ్డి, పెర్ల రామాంజనేయరెడ్డి, పల్లె వెంకట్రాం రెడ్డి, అన్నారెడ్డి సాంబశివా రెడ్డి, పోరెడ్డి విశ్వనాథ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, రాగిపిండి సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
అదేసమయంలో రాజారెడ్డి హత్యకేసులో శిక్షపడిన వెంకట్రాం రెడ్డి, లక్ష్మి రెడ్డి, సాంబశివారెడ్డి, శ్రీనివాసుల రెడ్డి తదితరులు గొల్లల గూడూరు జంట హత్య కేసులో దోషులుగా తేలడంతో ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|