|
| నిత్యావసర ధరలను అదుపు చేయండి: వైఎస్ |
| హైదరాబాద్, బుధవారం, 6 మే 2009 ( 10:53 IST ) | |
రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలను అదుపులోకి తేవాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారులును ఆదేశించారు. ఈ విషయంలో తనిఖీలు చేయడం ద్వారా అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ కోరారు.
వేసవి విడిదికోసం సిమ్లాలో ఉంటోన్న వైఎస్ అక్కడినుంచే అధికారులతో చర్చించారని పేర్కొన్న ముఖ్యమంత్రి కార్యాలయం ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. దీనిప్రకారం 84,750 క్వింటాళ్ల సూపర్ఫైన్ బియ్యాన్ని కిలో రూ. 18.25కు అందించేలా మిల్లర్లకు లక్ష్యాన్ని విధించామని వైఎస్ పేర్కొన్నారు.
తద్వారా ఈ బియ్యాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా రూ. 20లకే ప్రజలకు అందించాలని ఆయన ఆదేశించారు. అదేసమయంలో హైదరాబాద్లో మంగళవారం జరిగిన కలుషిత నీటి చావులు, మిగిలిన సమస్యల కారణంగా తన యాత్రను అర్థాంతరంగా ముగించుకున్న వైఎస్ బుధవారం రాష్ట్రానికి చేరుకోనున్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|