|
| విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం: 12మంది మృతి |
| విశాఖపట్నం, బుధవారం, 6 మే 2009 ( 10:36 IST ) | |
విశాఖపట్నం జిల్లాలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 12మంది మృతి చెందగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందినవారిలో ఎనిమిదిమంది పెద్దవారుండగా, మిగిలిన నలుగురు పిల్లలు.
విశాఖపట్నం జిల్లా ఎస్. రాయవరం మండలం అడ్డరోడ్డు వద్ద బుధవారం తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.
రోడ్డు ప్రమాదంలో మరణించినవారంతా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనుబర్తి, గోకర్ల గ్రామాలకు చెందిన వలస కూలీలు. కొవ్వూరులో పని ముగించుకుని లారీలో తిరిగి వస్తుండగా అడ్డరోడ్డువద్ద లారీ బోల్తాపడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|