|
| ఎవరికీ అపాయం లేదు: కలెక్టర్ ప్రకటన |
| హైదరాబాద్, 5 మే 2009 ( 17:33 IST ) | |
భోలక్పూర్లో కలుషిత నీటిని తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎవరికి కూడా ప్రాణాపాయం లేదని హైదరాబాద్ కలెక్టర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. అలాగే భోలక్పూర్ ఘటనలో కలుషిత నీటిని తాగడంవల్ల ఎవరూ చనిపోలేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ విషమయై కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుననవారు క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. అలాగే ఈ ప్రమాదంపై నిజానిజాలను తేల్చేందుకు ప్రత్యేక విచారణ కమిటీని నియమించినట్టు ఆయన తెలిపారు. భోలక్పూర్ ఘటనకు నిర్లక్ష్యమే కారణమని తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
భోలక్పూర్లో మంగళవారం కలుషిత నీటిని తాగిన కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆస్పత్రిలో చేరిన వీరిలో నలుగురు మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|