|
| భోలక్పూర్ ఘటనపై చంద్రబాబు విచారం |
| హైదరాబాద్, మంగళవారం, 5 మే 2009 ( 16:54 IST ) | |
హైదరాబాద్లోని భోలక్పూర్లో కలుషిత నీరు తాగి నలుగురు మృతి చెందిన ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ప్రస్తుతం విదేశాల్లో ఉంటోన్న చంద్రబాబుకు టీడీపీ నేతలు ఫోన్ ద్వారా భోలక్పూర్ ఘటనకు సంబంధించిన వివరాలు అందించారు. దీంతో చంద్రబాబు స్పందిస్తూ బాధితులకు తక్షణ సాయం అందించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ఘటనపై మంత్రి గల్లా అరుణకుమారి స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా అధికారుల నిర్లక్ష్యం గురించి మంత్రివద్ద ప్రస్తావించిన స్థానికులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|