|
| రాష్ట్రంలో రక్షణ కరువైంది: చంద్రబాబు ధ్వజం |
| నెల్లూరు, శుక్రవారం, 9 జనవరి 2009 ( 09:53 IST ) | |
ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రక్షణ కరువైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రౌడీయిజం ఎక్కువైపోయిందని ఆయన పేర్కొన్నారు.
నెల్లూరులో గురువారం నిర్వహించిన రాజకీయ సమ్మేళనం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. ఈ రాజకీయ సమ్మేళనం కార్యక్రమానికి సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతలు రాఘవులు, నారాయణలతో కలిసి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్ధేశించి మాట్లాడారు. కుంభకోణాల ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకే మహాకూటమి ఆవిర్భవించిందని అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆహ్లాదకరమైన సాయంత్ర గడిపేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సాయంత్రం ఏ పార్కుకో వెళితే ప్రాణాలతో తిరిగి వస్తామన్న గ్యారంటీ లేకుండా పోయిందని ఆయన అన్నారు. ఎప్పుడు ఏ ముష్కరుల దాడికి గురవుతామోనని విద్యార్ధినులు అనుక్షణ భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రౌడీలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దేశంలోని రౌడీలంతా రాష్ట్రానికే చేరుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|