|
| సత్యం కుంభకోణంపై ప్రభుత్వానిదే బాధ్యత: చిరు |
| 8 జనవరి 2009 ( 16:59 IST ) | |
సత్యం సంస్థలో చోటుచేసుకున్న కుంభకోణంపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. సత్యం ఇచ్చే కమీషన్లకు ఆశపడి ప్రభుత్వ పెద్దలు పెద్ద పెద్ద కాంట్రాక్టులను ఆ సంస్థకు అప్పగించారని ఆయన ఆరోపించారు.
గిద్దలూరులో గురువారం జరిగిన ప్రజా అంకితసభలో పాల్గొన్న చిరంజీవి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సాగుతున్న అవినీతిపై పోరాటం జరిపేందుకు ప్రజారాజ్యం పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గ్రామాలు తీవ్రంగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఈ సందర్భంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు జవసత్వాలు రావాలంటే ప్రజారాజ్యంకు పట్టం కట్టాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|