|
| సత్యం ఉద్యోగులకు బాసట: ముఖ్యమంత్రి |
| హైదరాబాద్, గురువారం, 8 జనవరి 2009 ( 15:29 IST ) | |
సత్యం సంస్థ ఉద్యోగులకు బాసటగా నిల్చేందుకు ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి పేర్కొన్నారు. సత్యంలో జరిగిన మోసాల నేపధ్యంలో ఆ సంస్థలోని ఉద్యోగులను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.
హైదరాబాద్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సత్యం సంస్థలో జరిగిన పరిణామాలు అనేక రంగాలపై ప్రభావం చూపుతాయని అన్నారు. అయితే ఈ పరిణామాలతో సంబంధం లేకుండా ఉద్యోగుల ప్రయోజనాలను రక్షించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
సత్యం సంస్థలో ఇటీవలకాలం వరకు జరిగిన మోసాలకు సంబంధించిన వివరాలను సంస్థలోని మిగిలిన భాగస్వాములకు తెలియజేసిన ఆయన తన ఛైర్మన్ పదవికి బుధవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో సత్యం సంస్థలో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగుల పరిస్థితి ఏంటనే విషయంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|