|
| తిరుమలలో ఘనంగా తిరుమంజన సేవ |
పుణ్యక్షేత్రమైన తిరుమలలో కలియుగదైవమైన శ్రీ వేంకటనాధునికి కోయల్ ఆళ్వార్ తిరుమంజన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఏడాదిలో నాలుగు సార్లు ఈ సేవలను ఉత్సవాలకు ముందు మంగళవారం రోజున నిర్వహించడం ఆనవాయితీ. ఈ సేవలో భాగంగా సుగంధ ద్రవ్యాలతో ఆలయాన్ని ఎంతో శ్రద్ధతో శుద్ధి చేస్తారు.
ఇక బుధవారం వైకుంఠ ఏకాదశి కావడంతో స్వామి వారి మూల విరాట్టుపై పట్టువస్త్రాన్ని కప్పి గర్భాలయంలో ఉన్న మిగిలిన దేవుళ్ల విగ్రహాలను వెలుపలకు తీసుకువచ్చి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థాన ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు, ఈవో రమణాచారి, ఇతర ఆలయ ఉద్యోగులు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో బుధ, గురువారాలు రెండు రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తున్నట్లు రమణాచారి వెల్లడించారు. ఏకాదశి రోజున 2 గంటలలోపు తోమాల, తిరుప్పావై, అర్చన తదితర సేవలను పూర్తి చేస్తామన్నారు. ఉదయం 3 గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభమవుతుందన్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|