|
| కాంగ్రెస్ నేతలు వాగ్ధాన హీనులు: రాఘవులు |
కాంగ్రెస్ నేతలు ఒట్టి వాగ్ధాన హీనులని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జలయజ్ఞం పేరిట ఏడు ప్రాజెక్టులు పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోందని, మరి నీరు మాత్రం అందించలేకపోతోందని దుయ్యబట్టారు. జలయజ్ఞం, నేతల జేబులు నింపుతోందని కానీ ప్రజలకు చుక్క నీరు అందించలేకపోతోందని ఆరోపించారు.
కర్నూలు వచ్చిన ఆయన అక్కడ పార్టీ నిర్వహించిన సమావేశానికి ఎద్దుల బండిపై వెళ్లారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రాజెక్టులపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లారీ యజమానుల సమ్మెకు మద్దతును తెలిపిన ఆయన వారిపై ఎస్మా ప్రయోగాన్ని ఆపకపోతే రాజకీయ పార్టీలు కల్పించుకుంటాయన్నారు.
రానున్న ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి నారాయణ పొత్తు పెట్టుకున్నా ఆయన మనసంతా తమ పార్టీ పైనే ఉందంటూ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలను రాఘవులు ప్రస్తావించారు. మనుషుల మనసుల్లో ఏముందో చిరుకు మాత్రమే తెలుస్తోందన్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|