|
| పట్టాలు తప్పిన పాట్నా ఎక్స్ప్రెస్: 15 మందికి గాయాలు |
| శ్రీకాకుళం, గురువారం, 4 డిసెంబర్ 2008 ( 12:21 IST ) | |
శ్రీకాకుళం జిల్లాలో పాట్నా ఎక్స్ప్రెస్ బుధవారం అర్ధరాత్రి పట్టాలు తప్పగా, ఎనిమిది బోగీలు పూర్తిగా పక్కకు ఒరిగాయి. సోంపేట- బారువాల మద్య ఉన్న లక్కవరం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 15మంది గాయపడగా, 108 సాయంతో వారిని అధికారులు సకాలంలో ఆస్పత్రికి తరలించారు.
ఎర్నాకుళం నుంచి పాట్నా వెళుతున్న ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు పలాస స్టేషన్ నుంచి బయలుదేరిన అర్ధగంటకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో రెండు ట్రాక్లు దెబ్బతినగా, విశాఖ- భువనేశ్వర్ల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వాటిలో ఓ ట్రాక్ను ప్రస్తుతానికి సిద్ధం చేసి ప్రమాదానికి గురైన రైలులోని ప్రయాణీకులను ప్రత్యేక రైలులో పాట్నా తరలించారు. మరికొన్ని రైళ్లను రాయ్గఢ్ మీదుగా నడిపారు. క్షతగాత్రులను బీహార్, ఒరిస్సాలకు చెందిన వారుగా గుర్తించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|