|
| రెండు ప్రమాదాల్లో పది మంది దుర్మరణం |
| ఒంగోలు, బుధవారం, 3 డిసెంబర్ 2008 ( 15:14 IST ) | |
రాష్ట్రంలో బుధవారం చోటు చేసుకున్న రెండు వేర్వేరు ప్రమాదాల్లో కనీసం పది మంది మరణించారు. ప్రకాశం జిల్లా, అద్దంకి మండలం, చక్రాలపాలెం వద్ద ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఆ ఆటోలోని ఏడుగులు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు వచ్చి వారిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతులు అద్దంకి మండలం, గోవాడ గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.
కడప జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అయ్యప్ప స్వామి భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రొద్దుటూరు మండలం, బొజ్జవారిపల్లె క్రాస్ రోడ్డు వద్ద లారీ అదుపు తప్పి ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|