|
| తెరాసను కాంగ్రెస్లో విలీనం చేయడం ఉత్తమం |
| హైదరాబాద్, శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 12:58 IST ) | |
తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్పై గట్టి నమ్మకముంటే తెరాసను కాంగ్రెస్లో విలీనం చేయడం ఉత్తమమని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్కు బీజేపీ జాతీయ కార్యదర్శి ఇంద్రసేనా రెడ్డి సూచన చేశారు. కాంగ్రెస్లో విలీనం చేయడమో లేక పార్టీని రద్దు చేయడమే చేయవచ్చన్నారు.
హైదరాబాద్లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్ ప్రకటిస్తే తెరాస ఉండాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణపై ఢిల్లీలో నిర్ణయం జరిగిందనే విషయాన్ని కేసీఆర్కు ఫోన్ చేసి చెప్పిన నేత ఎవరనే విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మరో నేత శేషగిరిరావు మాట్లాడుతూ ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రాజెక్టును మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|