|
| బీజేపీ ఎమ్మెల్యే దొరబాబుకు కాంగ్రెస్ తీర్థం |
| హైదరాబాద్, బుధవారం, 19 నవంబర్ 2008 ( 12:11 IST ) | |
పీఠాపురం శాసనసభ్యుడు దొరబాబు బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గాంధీ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్, కాంగ్రెస్ అధ్యక్షుడు డీఎస్ల సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యారు.
గత శాసనసభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఇద్దరు శాసనసభ్యులు మాత్రమే ఎన్నికవగా, ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దొరబాబు కూడా ప్రస్తుతం దూరం కావడంతో ఇక కిషన్ రెడ్డి మాత్రమే మిగిలారు.
గత కొంతకాలంగా బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న దొరబాబు కాంగ్రెస్లో చేరతారని ఊహాగానాలు వచ్చాయి. అద్వానీ నిర్వహించిన విజయసంకల్ప యాత్రకు ముందురోజే ఆయన సీఎల్పీ కార్యాలయంలో దర్శనమివ్వడంతో ఆ ఊహాగానాలకు బలం చేకూరాయి. దానిని నిజం చేస్తూ ఆయన బుధవారం ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|