|
| రోడ్షోలో తొక్కిసలాట: ఇద్దరి మృతి |
| ధర్మవరం, సోమవారం, 17 నవంబర్ 2008 ( 18:18 IST ) | |
ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అనంతపురం జిల్లాలో జరుపుతున్న ప్రజా అంకిత యాత్రలో భాగంగా సోమవారం ధర్మవరంలో నిర్వహించిన రోడ్షోలో తొక్కిసలాట జరగడంతో ఇద్దరు మృతి చెందారు. తీవ్రగాయాల పాలైన మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
చిరంజీవిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో వారిని అదుపు చేయడం భద్రతా సిబ్బందికి కష్ట సాధ్యమైంది. ఈ క్రమంలోనే ముందుకు దూసుకువస్తున్న వారిని చిరంజీవి వారించినప్పటికీ, ఫలితం లేకపోయింది.
ఒక్కసారిగా జనం ముందుకు తోసుకు రాగా, తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆది (30), తాజుద్దీన్ (35)లు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి చెట్టు కింద పడి గాయపడ్డాడు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|