యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
అల్పపీడనంగా మారిన వాయుగుండం
కావలి, 17 నవంబర్ 2008   ( 11:39 IST )
కోస్తాపై తీవ్ర ప్రభావం చూపిన ఖైముఖ్ క్రమంగా బలహీనపడి ఈ వాయుగుండం అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నెల్లూరు జిల్లా కావలి వద్ద తీరాన్ని దాటింది. ప్రస్తుతం నంద్యాల వద్ద కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.

దీని ప్రభావంతో వచ్చే 12 గంటల్లో తెలంగాణ, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపింది. అల్పపీడన ప్రభావం తగ్గుముఖం పట్టినందున చేపలవేటకు సంబంధించి జారీ చేసిన హెచ్చరికలను కూడా తొలగించామని వెల్లడించింది.

కాగా ఈ అల్పపీడన ప్రభావంతో కృష్ణా, గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పంటనష్టం జరిగినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయితే త్వరగానే అది తీరం దాటడంతో కొంతవరకు కోలుకోగలిగామని రైతులు ఊరట చెందుతున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కృష్ణ, ఇళయరాజాలకు ఎన్టీఆర్ అవార్డులు
సంక్షేమ పథకాల్లో అవినీతిని తొలగిస్తాం
గోరంట్లలో చిరు రాయలసీమ యాత్ర ప్రారంభం
ప్రచారానికి ప్రిన్స్ మహేష్‌బాబు: కృష్ణ వెల్లడి
నేటి నుంచి చిరంజీవి రాయలసీమ యాత్ర
చిరు ప్రజారాజ్యంలో చేరిన ఉపేంద్ర, శివశంకర్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...